Posts

ప్రత్యక్షరామచంద్రశతకము

ఈ ప్రత్యక్షరామచంద్రశతక కర్త గారి పేరు గొట్టిముక్కల కోటయ్య గారు. శతకంలోని 106వ పద్యంలో ఆయన    విలసిత గొట్టుముక్కల కోటయాఖ్యుడన్      రచియించితి శతక రాజమరయ   అని చెప్పుకున్నారు.  ఈ కవివర్యులు నివసించిన స్థలకాలాదుల వివరాలు తెలియవు. ఈశతకం 1943లో అచ్చయినదని మాత్రం పరోక్షంగా తెలుస్తున్నది. దొరకిన ప్రతిలో వివరం లేదు. ఇది ఒక సీసపద్య శతకం. ఈ‌ శతకం మకుటం  భక్తవత్సల భాసురభద్రశైల ధామ కృపసాంద్ర ప్రత్యక్షరామచంద్ర అని ఉండటం వలన ఈశతకంలోని పద్యాలన్నింటికీ ఎత్తుగీతిగా తేటగీతి మాత్రమే ఉండటం నియతం అవుతున్నది. ఈ‌శతకంలోని పద్యాలు ద్రాక్షాపాకంలో ఉండి చక్కటి ధారాశుధ్ధితో  ఉన్నాయి. అన్నీ రసరమ్యంగా ఉన్నాయి. కవిగారు శతకం మొదలు పెడుతూనే సీ॥ అవధరింపు దశర ♦ థాత్మజ నీమీద సీసశతకము ర ♦ చింతు నేను ఆంధ్రసంస్కృతనిఘం ♦ ట్వాది కావ్యము లైనఁ జదివి యెఱుంగని ♦ జడుఁడ గాన ఛందస్సులందున ♦ సద్యుక్తగణయతి ప్రాసలక్షణశబ్ద♦ దోషములను లేశమాత్రంబైన ♦ దేశికుని వలన మొదలె నేరనియట్టి ♦ మూఢమతిని తే.గీ॥ బహువిధంబుల మరువక ♦ భక్తి చేత సంతసంబున నీనామ ♦ స్మరణ జేతు భక్తవత్సల భాసుర ♦ భద్రశైల ధామ కృపసాంద్ర ప్రత్యక్ష ♦ రామచంద్ర   దొరకిన ప్రతి ముద్రణ కూడా

అమరనారేయణ శతకము

అమర నారేయణ కవినే నారేయణ తాత అని అంటారు. ఆయనను నారేయణ యతీంద్రులు అనీ అంటారు. తెలుగు కన్నడ భాషలు రెండింటిలోనూ పలు రచనలు చేసారు. అనేక తత్త్వాలు రచించారు. ఈ అమరనారేయణ శతకం ఆయన తెలుగులో రచించిన శతకం. ఆయన తెలుగులో 144 తత్త్వాలనూ కన్నడంలో 18 తత్త్వాలనూ రచించారు. వీటిని ‘’శ్రీ అమర నారేయణ యతీంద్ర వేదాంత సారావళి‘’ అని పిలుస్తారు.  ఈ కైవారం తాతయ్య గారు 1726లో కొండప్ప, ముద్దమ్మ దంపతులకు కైవారం  నారాయణప్ప పేరున జన్మించి1836-37 సంవత్సరం జ్యేష్ట శుద్ధ తదియ రాత్రి 12 గంటలకు అంటే 110 ఏళ్ళ వయసులో సమాధిగతులైనారు. ఈ కైవారం కర్నాటకలో ఉంది. అక్కడ కైవారం తాత గారి సమాధి మరియు ఆశ్రమం కూడా ఉన్నాయి.   అఖిలవేదాంతార్ధప్రతిపాదకమైన యీ అమరనారేయణ శతకం 1959వ సంవత్సరంలో చిత్తూరులో ప్రచురించబడింది. ఈ‌ శతకం సీస పద్యాలలో రచించబడింది.  ఈ శతకానికి మకుటం ఎత్తుగీతిలో చివరి రెండుపాదాలుగా ఉంచబండింది. ఈ మకుటం అమర నారేయణాచ్యుత హరి ముకుంద దురితదూరక కైవరపురవిహార ఈ  మకుటం తేటగీతిలో మాత్రమే యిముడుతుంది కాని ఆటవెలదిలో యిమడదు కాబట్టి ఈశతకం మొత్తం సీసాలకు ఎత్తుగీతిగా తేటగీతులే ఉండటం అనివార్యం. కాని ఈశతకంలో ఆస్పృహ ఎడనెడ తప్పుతూ ఉండటం గమనా

ఆనందరామశతకము

ఈ ఆనందరామ శతకాన్ని రచించిన కవి గారి పేరు మత్తనపెద్ది సత్యనారాయణ.  వీరు సోమవరం వాస్తవ్యులు. ఈ సోమవరం అనే ఊళ్ళు రెండున్నాయి. ఒకటి నందిగామ మండలంలో ఉంది మరొకటి కిర్లంపూడి మండలంలో ఉంది.  ఈశతకాన్ని పరిష్కరించిన అడ్లూరి సీతారామ శాస్త్రి గారు భద్రాచలదేవస్థాన పండితులు. భద్రాచలం నందిగామకు 153కిమీ దూరంలోనూ కిర్లంపూడికి 214కిమీ దూరంలోనూ ఉండటం వలన కవిగారు నివసించిన సోమవరం నందిగామ మండలం లోనిది కావచ్చును. ఈ ఆనందరామ శతకం 1920లో ముద్రితమైనది. ఈ ఆనందరామశతకం ఒక చక్కని అథ్యాత్మభావనాగుఛ్చం అని చెప్పవచ్చును. రాముడి గుణగణాదులను ప్రస్తుతి చేసే పద్యావళితో పాటు జీవుడి వేదనను వెల్లడించే పద్యాలూ అనేకం వివిధభావాలతో ఇక్కడ ఉన్నాయి. కవిగారికి మంచి సంస్కృతభాషాపాండిత్యం ఉంది. తెలుగుశతకం ఐనా సరే వీరి మొగ్గు సంస్కృతసమాసాలవైపే ఉన్నదని చెప్పవచ్చును. ఈ ఆనందరామ శతకం "ఆనందరామా ప్రభో" అన్న శతకంతో విరాజిల్లుతున్నది కాబట్టి ఈశతకంలో వాడబడినవి మత్తేభ శార్దూల వృత్తాలు. ఈ శతకంలోని పద్యాలు కొంచెం సంస్కృతపదాడంబరసంశోభితాలు అని ముదే చెప్పాను కదా.  ఐనా ఆన్నీ మంచి ధారాశుధ్ధి కలిగి కదళీపాకంలో ఉన్నాయి. కవిగారు పాఠకుల సౌలభ్యాన్ని ద

ముందుమాట

తెలుగుభాషలో శతక ప్రక్రియ విశిష్టమైనది. ఒక ఛందోవిశేషం తీసుకొని అన్ని పద్యాలూ వ్రాయాలి. వాటి సంఖ్య ఒక వంద కావాలి. ఆ పద్యాలన్నింటికీ ఒకే విధమైన ముగింపు ఉండాలి. ఆ ముగింపు ఒక పదం కావచ్చును - ఏదో కేశవా అనో కృష్ణా అనో‌ శివా అనో ఉండవచ్చును. లేదా ఒక పదబంధం కావచ్చును శ్రీగిరి మల్లికార్జునా అన్నట్లుగా, దాశరథీ‌ కరుణాపయోనిధీ అన్నట్లుగా. ఒక్కొక్క సారి ఆ ముగింపు ఏకంగా ఒక పాదం అంతా పరచుకొని ఉండవచ్చును హతవిమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ అన్నట్లుగా. అరుదుగా ఒక పాదం కన్నా హెచ్చుగానే ఉండవచ్చును కూడా భావనారాయణ భక్తపోషణ మదాత్మవిలక్షణ రక్షణేక్షణా అన్నట్లుగా. ఇలా వందో అంతకు మిక్కిలిగానో పద్యాలు వ్రాసి ఒక కృతిని నిర్మిస్తే అది ఒక శతకం అనిపించుకుంటుంది. మరలా ఈశతకాలు రకరకాలు. ముప్పాతికమువ్వీశం శతకాలు భక్తిపూర్వకమైన రచనలు. మిగిలిన వాటిలో అధికభాగం నీతిబోధలు.  నిజానికి ఇప్పటికి కొన్ని వందల సంవత్సరాలుగా శతకాలు వస్తునే ఉన్నా, ఇప్పటికీ‌ మన తెలుగుకవులకు శతక నిర్మాణం మీద మక్కువ యేమీ తగ్గలేదు. సరికదా ఇటీవల మరింత హెచ్చింది అనిపిస్తున్నది. విచారించవలసిన విషయం ఏమిటంటే రానురాను శతకాల లోని భాష, భావశబలత, సుబోధకత అన్న ముఖ్యమైన మూడు

అగస్త్యలింగశతకము

అందమైన ఈ‌ అగస్త్యలింగశతక కర్త తాడికొండ పూర్ణమల్లికార్జున అయ్యవార్లం గారు అని నాకు లభించిన 1935వ సంవత్సరంలో బెజవాడలో ముద్రించబడిన ప్రతిముఖపత్రం విదితం చేస్తోంది. ఇది ఒక శివపరమైన రమ్యమైన సీసపద్య శతకం. శతకం అన్నాక ఒక మకుటం ఉండాలి కదా. ఈ‌శతకంలో ఒకటికంటే ఎక్కువే మకుటాలు కనిపించటం అనేది ఒక విశేషం. ఐనా శతకపద్యాలలోని ఎత్తుగీతి చివరి పాదంలో ఈమని అగస్త్యలింగ అన్న సంబోధన మాత్రం తప్పకుండా ఉంది. కాబట్టి ఆ ఒక్క ముక్కనే మనం‌ మకుటంగా గ్రహించాలి. విస్తరించి చూసిన పక్షంలో మనకు కనిపించే మకుటాలు     ఈమని యగస్త్యలింగ బాలేందుసంగ     ఈమని యగస్త్యలింగ పుష్పేషుభంగ     కలుషచయభంగ యీమనగస్త్యలింగ కవి గారి యింటి పేరు తాడికొండ. ఈ తాడికొండ గుంటూరు జిల్లాలో ఉంది. కవి గారు తెనాలి దగ్గర ఉన్న ఈమని గ్రామంలో శా.శక 1776వ (క్రీ.శ 1855) సంవత్సరంలో జన్మించారు. వీరు భారద్వాజగోత్రీకులైన బ్రాహ్మణులు, శైవులు. దినదినమూ 21600 నామజపం చేసే షట్కాల శివపూజా దురంధరులైన ఈ కవి గారు సంస్కృతాంధ్రభాషల్లో మంచి పాండిత్యంతో పాటుగా సంగీతశాస్త్ర మంత్రశాస్త్రాల్లో కూడా మంచి ప్రతిభ కలవారు. ఈ‌ శతకప్రతిలో చివరన కవి గారు రచించిన శివకీర్తనలు కూడా ఉన్నాయి